Current Date: 05 Oct, 2024

తెలుగువాళ్ళిద్దరే అత్యధిక ధనిక ఎంపీలు

కొత్తగా ఏర్పడ్డ పార్లమెంటులో తెలుగు వాళ్ళే ఆకర్షణగా నిలిచారు. పార్లమెంటు మొత్తానికి ధనికులైన ఇద్దరు ఎంపీలు తెలుగు వారే కావడం విశేషం. ఏపీలోని గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన పెమ్మసాని చంద్రశేఖర్‌ 5705 కోట్ల రూపాయల ఆస్తితో అందరికన్నా ధనిక ఎంపీగా నిలిచారు. అయితే రెండో స్థానం కూడా మన తెలుగు ఎంపీకే దక్కడం విశేషం. తెలంగాణలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి గెలుపొందిన విశ్వేశ్వర రెడ్డి 4568 కోట్ల రూపాయల ఆస్తులతో రెండవ దనిక ఎంపీగా ఉన్నారు.