Current Date: 06 Oct, 2024

విశాఖ కోర్టుకు నారా లోకేష్‌

 ఏపీ విద్యా శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం ఉదయం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. తాను దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చారు. తనపై చినబాబు చిరుతిండి.రూ. 25 లక్షలండి పేరుతో సాక్షి దిన పత్రికలో ప్రచురించిన అసత్య కథనంపై నారా లోకేష్‌ స్పందించి, ఈ కథనంపై న్యాయ పోరాటం చేయాలని ఆయన నిర్ణయించారు. అందులోభాగంగా ఈ కథనంపై కోర్టులో లోకేశ్‌ పరువు నష్టం పిటిషన్‌ దాఖలు చేశారు.  తన పరువునకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారంటూ లోకేశ్‌ కోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో గురువారం విశాఖపట్నం 12వ అదనపు జిల్లా కోర్టుకు లోకేశ్‌ హాజరయ్యారు.

Share