Current Date: 05 Oct, 2024

సీతమ్మధార నుంచి సీమాంతరాలకు.. . ముగిసిన మీడియా మొఘల్‌ రామోజీరావు అప్రతిహత ప్రస్థానం

 విశాఖపట్నం సీతమ్మధార నుంచి ప్రారంభమైన ‘ఈనాడు’ అధినేత రామోజీరావు 88 ఏళ్ల అప్రతిహత ప్రస్థానం ముగిసింది. అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీరావు తెలుగు పత్రికా ప్రపంచంలోనే కాకుండా మొత్తం మీడియాకే మొఘల్‌గా మారారు. సీతమ్మధార నుంచి సీమాంతరాలకు విస్తరించిన ఖ్యాతి ఈనాడు రామోజీరావుది.1936, నవంబర్‌ 16న జన్మించిన రామోజీరావు తెలుగు పత్రికా ప్రపంచంలో తిరుగులేని కీర్తిని సంపాదించారు. సీమాంధ్ర నుంచి ప్రారంభమైన తెలుగు జర్నలిజం ప్రస్థానం సీమాంతరాలకు పాకింది. ప్రచురణ రంగం గానీ, ఇతర ఏ పరిశ్రమలు గానీ ఏ మాత్రం లేని విశాఖపట్నం నుంచి ఓ పత్రికను ప్రారంభించడం అనేది ఆయనకే చెల్లింది.