Current Date: 07 Oct, 2024

మీడియాకు క్షమాపణ చెప్పిన నీతా అంబానీ

భారతదేశ శ్రీమంతుడు ముఖేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం తర్వాత శుభ్ ఆశీర్వాద్, మంగళ్ ఉత్సవ్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు నీతా అంబానీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు, తమ వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే క్షమించాలని మీడియాను కోరారు. పెళ్లి సందర్భంగా చిన్నిచిన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉందని తెలిపారు. మీరంతా  మా అతిథులుగా రావాలని కోరారు. మీకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని చెప్పారు.

Share