Current Date: 07 Oct, 2024

విమానంలో అస్వస్థతకు గురైన ప్రయాణికుడు నారా భువనేశ్వరి చలవతో సకాలంలో వైద్యసేవలు

ఇవాళ హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురికాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి చలవతో ఆ ప్రయాణికుడికి సకాలంలో వైద్యసేవలు అందాయి. ఆ విమానంలో శశిధర్ అనే ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఆ ప్రయాణికుడు అస్వస్థతకు గురైన అంశాలన్ని ఆమె ఏపీముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సీఎంవో సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో విమానం వద్దకే డాక్టర్లను, అంబులెన్స్ ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్ కోలుకున్నాడు.

Share