Current Date: 07 Oct, 2024

హైదరాబాద్‌-అమరావతి హైవేపై గడ్కరీతో చర్చించిన చంద్రబాబు

డిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు హైవేల నిర్మాణంపై చర్చించారు. అనంతపురం- అమరావతి, హైదరాబాద్‌-అమరావతి హైవేల నిర్మాణం త్వరితగతిన సాకారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరినట్టు సమాచారం. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు పలువురు రాష్ట్ర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Share