Current Date: 05 Oct, 2024

అనుమతి లేని హాస్టళ్ల పై కఠిన చర్యలు: మంత్రి అనిత

అనకాపల్లి జిల్లాలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఆ హాస్టల్ కు అనుమతి లేదని చెప్పారు.అనుమతి లేకుండా నడుస్తోన్న హాస్టళ్ల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సదుపాయాలు సరిగా లేని హాస్టల్ ను మూసేయించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఘటన పై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆరా తీశారని వెల్లడించారు.

 

Share