Current Date: 02 Jul, 2024

కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఆయన బెయిల్ నిలుపుదల చేస్తూ తాము ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని ఢిల్లీ హైకోర్టు బెంచ్ నేడు స్పష్టం చేసింది. ఈడీ అధికారులు, కేజ్రీవాల్ నిన్న తమ లిఖితపూర్వక వాదనలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. ఆ వాదనలను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. దాంతో కేజ్రీవాల్ కు నిరాశ తప్పలేదు. కాగా, తన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు నిలుపుదల చేయడాన్ని కేజ్రీవాల్ ఇంతకుముందే సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... ఢిల్లీ హైకోర్టు తుదితీర్పు వచ్చేవరకు తాము వేచిచూస్తామని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో, రేపు సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

Share