Current Date: 02 Jul, 2024

ఎంవీవీ కి ముందస్తు బెయిల్

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కు కింది కోర్ట్ లో ముందస్తు బెయిల్ లభించింది. తనను, తన భార్య ను బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకం చేయించు కున్నారని హయాగ్రీవా జగదీశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు పై ఆరిలోవ పోలీస్ లు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో ఆడిటర్ జి. వెంకటేశ్వర రావు, గద్దె బాలాజీ కూడా వున్నారు. అయితే వీరికి ముందస్తు బెయిల్ ఇంకా రాలేదని తెలుస్తోంది. ముందుగా ఈ కేసును కొట్టివేయాలని  ఎంవీవీ హైకోర్టు ని ఆశ్రయించారు. అయితే ఫిర్యాదు దారుకి నోటీసు లు ఇచ్చి కేసుని రెండు వారాలకు వాయిదా వేసింది.

Share