Current Date: 04 Jul, 2024

సి.రామచంద్రయ్య, హరిప్రసాద్ లకు ఎమ్మెల్సీ పదవులు

ఏపీలో ఇటీవల ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ పదవులకు కూటమి పార్టీల తరపున అభ్యర్థుల్ని ఖరారు చేశారు. టీడీపీ తరపున సీ రామచంద్రయ్య, జనసేన తరపున పి.హరిప్రసాద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉండి నాలుగేళ్ళ పదవీకాలం ఉండగానే రామచంద్రయ్య రాజీనామా చేసేసి టీడీపీకి మద్దతుగా ఉన్నారు. అలాగే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయ కార్యదర్శిగా, పార్టీ మీడియా హెడ్ గా ఏలూరుకు చెందిన హరిప్రసాద్ పని చేస్తూ వచ్చారు. ఆయన 25ఏళ్లపాటు మీడియా రంగంలో అనుభవం ఉంది.

Share