Current Date: 01 Oct, 2024

కోర్టు విచారణ నేపథ్యంలో లడ్డూ కేసులో సిట్‌ విచారణకు విరామం డీజీపీ ద్వారకా తిరుమలరావు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో లడ్డూ కేసులో సిట్‌ విచారణకు విరామం ప్రకటించింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సిట్‌ దర్యాప్తును ఈనెల 3వ తేదీ వరకు విచారణ నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని తెలిపారు.

Share