Current Date: 05 Oct, 2024

మహిళా-శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

 పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో  పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ  కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్‌ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు.  మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

Share