Current Date: 07 Oct, 2024

పోలీసుల్ని పరుగులు పెట్టించిన రాజ్‌తరుణ్ లవర్!

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‌ తరుణ్- లావణ్య ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే. రాజ్‌ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని.. అబార్షన్ కూడా చేయించాడని లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాజాగా.. లావణ్య సూసైడ్ చేసుకుంటానని తన అడ్వకేట్‌తో చేసిన చాటింగ్ కలకలం రేపింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి అడ్వకేట్‌కు మెసేజ్ చేసింది.ఈ లోకంలో నా ప్రయాణం పూర్తి చేశాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నేను ఎంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. ఈ లోకం ఒక మాయ.. ఈ మాయా ప్రపంచంలో బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు. మైండ్ గేమింగ్ గాసిప్స్‌తో విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగింది. నా భర్త నాకు కావాలంటూ మాల్వీ మల్హోత్రాను బ్రతిమిలాడాను. కానీ తను వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు, మాల్వీ మలోత్రా. 

Share