Current Date: 07 Oct, 2024

స్కూల్ మధ్యలో వెళ్లిన బాలిక గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా!

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది.. చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి తీవ్ర కలకలంరేపింది. అదే గ్రామంలోని గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో బాలిక విగతజీవిగా పడి ఉంది. ఆమె మెడపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు.. దీంతో హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.సోమవారం ఉదయం బాలిక, ఆమె అన్నయ్య కలిసి స్కూల్‌కు వెళ్లారు. పాఠశాల ముగిసిన వెంటనే బాలుడు ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించగా.. ఆ బాలుడు స్కూల్‌కు వెళ్లి ఆరా తీశాడు. ఉపాధ్యాయులను అడగగా.. ఒంట్లో బాగోలేదని మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు టీచర్లు చెప్పారు. వెంటనే బాలుడు తల్లికి చెప్పగా ఇద్దరు కలిసి ఊరిలో బాలిక కోసం వెతికారు. ఈ క్రమంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంటి దగ్గర బాలిక చెప్పులు ఉన్నట్లు సోదరుడు గుర్తించాడు. వెంటనే ఆ ఇంటి కిటికీలో నుంచి చూస్తే బాలిక మంచంపై విగతజీవిగా కనిపించింది. దాంతో ఆ ఇంటి తాళం పగులగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు.గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజుకు పెళ్లయినా   మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. 

Share