Current Date: 05 Oct, 2024

తాడేపల్లిలో యువతిపై ప్రేమోన్మాది దాడి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. నర్సుగా పనిచేస్తున్న యువతి (23)పై ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. వడ్డేశ్వరంలోని హాస్టల్‌ వద్ద బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఘటనాస్థలాన్ని తాడేపల్లి పోలీసులు పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాకు చెందిన యువతి ఓ ప్రైవేటు వైద్యకళాశాలలో మూడేళ్లుగా నర్సుగా పనిచేస్తోంది. వైద్యకళాశాలకు చెందిన హాస్టల్‌లోనే ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం సెలవు కావడంతో చర్చికి వెళ్లి తిరిగి హాస్టల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో యువతితో మాట్లాడేందుకు బందరు సమీపంలోని క్రోసూరుకు చెందిన క్రాంతి మౌళి యత్నించాడు. తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన క్రాంతి మౌళి తన వద్ద ఉన్న బ్లేడుతో యువతి మెడపై దాడి చేశాడు.   యువకుడు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. యువతిని ఆస్పత్రికి తరలిం చారు.

Share