Current Date: 05 Oct, 2024

గ్యాస్‌ కట్టర్లతో ఏటీఎం ధ్వసం రూ.30 లక్షలు చోరీ

అనంతపురంలోని రామ్‌నగర్‌ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తరువాత ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్‌ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు. ఆదివారం ఉదయం ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నాలుగో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌ టీం ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని సీఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

Share