Current Date: 02 Jul, 2024

సీఎస్‌ నీరబ్‌కుమార్‌ పదవీకాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌  సర్వీసు 6నెలల పాటు పొడిగిస్తూ  కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   నీరబ్‌ ఈ నెల  మొదటి వారం నుంచి ఏపీ సీఎస్‌ గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన పదవీకాలం నెలాఖరులో ముగియనుంది.   నీరబ్‌ కుమార్‌ సేవలు కొనసాగాలని, పదవీ కాలాన్ని పొడిగించాలని ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి   ప్రతిపాదన పంపింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఆయన  సర్వీసును ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ  భారత ప్రభుత్వ అండర్‌ సెక్రటరీ  భూపీందర్‌ పాల్‌ సింగ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Share