Current Date: 05 Oct, 2024

‘ఈనాడు’ రామోజీ కన్నుమూత

రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, ఈనాడు దినపత్రిక ఎడిటర్‌ చెరుకూరి రామోజీరావు (88) మరి లేరు.  తీవ్ర అస్వస్థతకు గురై ఆయన శనివారం తెల్లవారుజామున తుది శ్వాశ విడిచారు. ఆయనకు గత కొన్నాళ్లగా ఆరోగ్యం బాలేదు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. కొన్నాళ్లగా ఆయనఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే వైద్యులు స్టంట్‌ వేశారు. శుక్రవారం రాత్రి ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారవ్వడంతో ఆస్పత్రిలో వైద్యులు మరోమారు పరీక్షించారు.ఆయన మృతి బాధాకరం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామోజీ పేరు తెలియని వారుండరు. వ్యవసాయదారుడిగా, జర్నలిస్టుగా, పారిశ్రామిక వేత్తగా, సినీ నిర్మాతగా ఆయన దేశంలోనే పేరొందారు.40ఏళ్ల క్రితం విశాఖ వేదికగా ఈనాడు దినపత్రికను ప్రారంభించి ఏపీలోనే అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన పత్రికగా ఆయన దానిని తీర్చిద్దిద్దారు.

Share