Current Date: 09 Oct, 2024

అనస్తీషియనా ఇవ్వకుండా ఎస్పీ బాలు పాట వింటూ ఆపరేషన్

విజయనగరం జిల్లాలో అరుదైన సర్జరీ నిర్వహించారు. రాజాంలోని జీఎంఆర్‌ కేర్‌ ఆసుపత్రిలో వృద్ధురాలికి మత్తు మందు ఇవ్వకుండానే డాక్టర్లు మెదడుకు సర్జరీని పూర్తి చేశారు.65 ఏళ్ల మహిళ పక్షవాతం లక్షణాలతో బాధపడుతోంది.. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమె మెదడులో రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు.. సర్జరీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆమెకు వయోభారంతో పాటు గుండెకు సంబంధించిన సమస్య, ఉబ్బసం ఉండటంతో జనరల్‌ అనస్తీషియా ఇవ్వడం ప్రమాదకరమని తేల్చారు.ఈనెల 4న రోగిని మెలకువగానే ఉంచి సర్జరీని డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటుండగా సర్జరీ చేయించుకున్నారు.

Share