Current Date: 07 Oct, 2024

బాలయ్య మూవీపై నోరుజారిన అనుష్క.. వివాదం స్టార్ట్

టాలీవుడ్‌లో వివాదాలకి దూరంగా ఉంటూ.. అందరితో కలుపుగోలుగా ఉండే హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. టాప్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క జీరో సైజ్ సినిమాతో లావు పెరిగి తన కెరీర్‌ని డేంజర్‌లోకి నెట్టేసుకుంది. ఇప్పుడు కాస్త బరువు తగ్గినా.. ఆఫర్స్ రావడం లేదు. గత ఏడాది వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కూడా ఆకట్టుకోలేకపోయింది.అనుష్క ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 19 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. ‘‘ నేను నటించిన చిత్రాల్లో 'వేదం', 'అరుంధతి' చాలా ఇష్టం. నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయి. ఇక చెత్త మూవీ అంటారా..? 'ఒక్క మగాడు'. ఆ సినిమా నాకు అస్సలు నచ్చలేదు’’ అని చెప్పేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్క మగాడు మూవీ 2008లో విడుదలైంది. వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, విషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అనుష్క కామెంట్స్‌పై బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

Share