Current Date: 06 Jul, 2024

ఎన్టీఆర్ షర్ట్‌‌ కలర్‌పై రచ్చ.. టీడీపీని ఇరుకున పడేసిన వైసీపీ


ఏపీలో ఎన్నికల వేళ.. ఎన్టీఆర్, మహేష్ బాబు వేసుకున్న షర్ట్ కలర్ గురించి తీవ్రంగా చర్చ నడిచింది. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ లోకి వస్తుందో ఎవరూ చెప్పలేం. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఎల్లో శారీ, బ్లూ షర్ట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేసేందుకు బ్లూ షర్ట్ లో రావడం సంచలనంగా మారింది.

వాస్తవానికి మొదట్లో ఎవరూ ఆ విషయంపై ఫోకస్ చేయలేదు కానీ, ఆ తర్వాత కొంతమంది బ్లూ షర్ట్ ని హైలైట్ చేశారు. వైసీపీకి మద్దతు తెలిపేందుకే ఎన్టీఆర్ బ్లూ షర్ట్ వేసుకున్నారని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ హాట్ టాపిక్ గా మారింది. కానీ ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ.. టీడీపీ కూడా కౌంటర్ చేయలేక కిమ్మకుండిపోయింది.

అప్పట్లో షర్మిల ఎల్లో శారీ కూడా ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం జగన్ స్వయంగా ఈ ప్రస్తావన తేవడం విశేషం. తన తండ్రి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబుని కలిసేందుకు వెళ్లినప్పుడు ఎల్లో శారీ కట్టుకుని వెళ్లిందని, టీడీపీ రంగుకి ఆమె ప్రచారం కల్పించిందన్నట్టుగా జగన్ మాట్లాడారు. జగన్ వ్యాఖ్యలపై షర్మిల కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు