Current Date: 02 Oct, 2024

బాలయ్య ఫంక్షన్‌కి రాని మోక్షజ్ఞ కావాలనే దాస్తున్నారా?

నందమూరి బాలయ్య 50 ఏళ్ల సినిమా కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు బాలయ్య కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వచ్చారు. కానీ, చంద్రబాబు, లోకేష్ రాలేదు. ఏపీలో వర్షాలతో అతలాకుతలంగా ఉండటంతో ఏపీలోనే ఉండిపోయారు. కానీ అనూహ్యంగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కూడా రాలేదు.వాస్తవానికి హీరోగా త్వరలోనే మోక్షజ్ఞ ను పరిచయం చేయబోతున్నారు. కాబట్టి ఈ ఫంక్షన్ కు మోక్షజ్ఞ  తప్పనిసరిగా రావాలి. ఎందుకంటే తండ్రి బాలయ్య సాధించిన అపూర్వమైన ఫీట్ ఇది. అందరూ వచ్చారు. అతని కొడుకు కూడా వచ్చింటే బాగుండేది అని నందమూరి అభిమానులు అనుకుంటున్నారు.విశాఖపట్నంలో మోక్షజ్ఞ  డైలాగ్, నటన శిక్షణను సత్యానంద్ దగ్గర తీసుకున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.ఈ ఫంక్షన్‌కు అతను వస్తే కెమేరాల కళ్లు అన్నీ మోక్షజ్ఞ  మీదే వుంటాయి. దాంతో లాంచ్ టైమ్‌లో అంత ఇంట్రస్ట్ అభిమానులకి కనిపించదు. అందుకే కొన్నాళ్ల పాటు మీడియా కంట పడకుండా దూరంగా ఉంచుతున్నారని తెలుస్తోంది.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి, నందమూరి తేజ‌స్విని కలిసి నిర్మించే సినిమాతో మోక్షజ్ఞ  తొలి సినిమా త్వరలో ప్రారంభమతవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జ‌రుగుతోంది.

Share