Current Date: 02 Jul, 2024

వైయస్ జగన్ ఓటమిపై రేవంత్ రెడ్డి సెటైర్

ఏపీ ఎన్నికల్లో వైయస్ జగన్‌ను ప్రజలు ఎందుకు ఓడించారో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియా మిత్రులతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రజలు అధికారాన్ని ఇచ్చింది పగలు తీర్చుకోవడానికి కాదని  అభివృద్ధి చేయమని ఇస్తే జగన్ భిన్నంగా ప్రవర్తించాడు. దాంతో ఆయన చేసిన పనులు తప్పు అని నిరూపించడానికే మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లను వైసీపీకి ప్రజలు ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.జగన్ చచ్చిన పాములాంటి వాడని, చంద్రబాబును ఖతం చేయాలనుకుని తానే ఖతమయ్యారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోటస్‌ పాండ్‌ కూల్చివేతలపై చంద్రబాబుకు సంబంధం లేదని తనకు తెలియకుండానే అవి జరిగాయని రేవంత్ వివరణ ఇచ్చారు.

Share