Current Date: 06 Oct, 2024

దేశంలోనే యంగెస్ట్‌ కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌

దేశంలోనే యంగెస్ట్‌ కేంద్ర మంత్రిగా  టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు రికార్డు సృష్టించనున్నారు. కేంద్ర మంత్రిగా బీసీ నేత, మన సిక్కోలు బిడ్డ, కింజరాపు రామ్మోహన్‌ నాయుడు  అంటూ టీడీపీ ఆదివారం  ట్వీట్‌ (ఎక్స్‌) చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రన్న మరోసారి  పెద్ద పీట వేశారని, కేవలం 36ఏళ్లకే దేశంలోనే యంగెస్ట్‌ కేంద్ర మంత్రిగా రామ్మోహన్‌ పదవిని అలంకరించనున్నారని ఆ ట్వీట్‌లో టీడీపీ పేర్కొంది. ఆయన శ్రీకాకుళం జిల్లా ఎంపీగా మూడుసార్లు వరుసగా విజయం సాధించారని, బీటెక్‌, ఎంబీఏ చేసిన విద్యావంతుడు అని స్పష్టం చేసింది.

Share