Current Date: 06 Jul, 2024

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలపై కేసు నమోదు . కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టారంటూ అభియోగం

కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై తాడేపల్లి పోలీసులు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్‌ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన కామెంట్స్‌పై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ గురువారం చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు.