Current Date: 06 Oct, 2024

ఇక నుంచి ఏపీ ప్రభుత్వ జీవోలు ప్రజలకు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను తిరిగి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్ సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుండి ప్రభుత్వ శాఖలు అన్ని ఉత్తర్వులను జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 29 నుండి అన్ని శాఖల జీవోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని తెలిపింది.

Share