Current Date: 07 Oct, 2024

గిరి ప్రదక్షిణ కోసం సింహాచలం చేరుకుంటున్న భక్తులు

ఆషాడ పౌర్ణమి రోజున జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయాన్నే భక్తులు తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభం చేశారు. రెండు  రోజులుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో సింహాచలం చేరుకుంటున్నారు. భక్తులకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. కాగా సాయంత్రం 4 గంటలకు గిరిప్రదక్షిణ మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు.  

Share