Current Date: 07 Oct, 2024

విశాఖలో తిరుమల బాలాజీని దర్శించుకున్న వెంకయ్య

75వసంతాలు పూర్తిచేసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విశాఖలోని షీలానగర్ లో ఉన్న తిరుమల బాలాజీని దర్శనం చేసుకున్నారు. షీలానగర్ లో ఉన్న ఎస్ టీబీఎల్ తిరుమల బాలాజీ దివ్య క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడుకు పూర్ణకుంభoతో స్వాగతం ఎస్ టీబీఎల్ అధినేత గుత్తికొండ బాలాజీ వీరభద్రరావు ప్రత్యేక పూజలు జరిపించారు. తోమాల సేవలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ మందిరాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఇంత మంచి దేవాలయo ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ప్రజలంతా భక్తి భావంతో ఉండాలని, అప్పుడే దేశం సుఖంగా ఉంటదని, రోజూ దేవాలయాన్ని సందర్శించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ లభిస్తుందన్నారు. మన  జీవితంలో ఎన్నో  ఒడిదుడుకులు ఎదుర్కొనే ఉంటామని, ఆలయాల్లో భజనలు, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. 

Share