Current Date: 04 Jul, 2024

తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర

 ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి  సోమవారం తిరుమలకు మహిళలు, రైతులు చేపట్టిన పాదయాత్ర ను  తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ పాదయాత్ర 20 రోజుల పాటు కొనసాగనుంది.

Share