Current Date: 06 Oct, 2024

ఒక లెజెండ్‌ నిష్క్రమించారు .. రామోజీకి గండి బాబ్జీ నివాళి

ఒక లెజెండ్‌ నిష్క్రమించారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రామోజీ చిత్రపటానికి బాబ్జీ సహా టీడీపీ నాయకులు పూల మాలలు వేసి, ఘన నివాళులర్పించారు. ఎందరో కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తి రామోజీ అన్నారు అటువంటి వ్యక్తి మళ్ళీ మన రాష్ట్రంలోనే పుట్టాలని కోరుకున్నారు. కార్యక్రమంలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share