Current Date: 06 Jul, 2024

టీడీపీ ఆఫీసుపై దాడి.. వైసీపీ కీలక నేతలు అరెస్ట్‌

టీడీపీ సెంట్రల్‌ ఆఫీస్‌పై దాడి కేసులో పోలీసులు వేగం పెంచారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు ఖాజామొహిద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. రోషన్‌, రాములతో పాటు మరో ముగ్గుర్ని సైతం మంగళగిరి రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరికొందరు అనుచరులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే అనుచరులు ఏడుగురు పాల్గొన్నట్లు నిర్ధారించారు. ఏడుగురు నిందితులూ తాడేపల్లికి చెందిన వారేనని తెలుస్తోంది. వైసీపీ నేతలు అవినాష్‌, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో దాడి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతా గుణదల, రాణిగారితోట, కృష్ణలంక, తాడేపల్లి, గుంటూరుకు చెందిన వారేనని తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న నిందితుల కదలికలపై పోలీసుల ఫోకస్‌ పెట్టారు.

Share