Current Date: 05 Oct, 2024

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ లో వీరు కూడా

ఇవాళ్టి మీటింగ్‌లో సీఎంలతో పాటూ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎస్‌లు, రెండు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటున్నారు. ప్రధాన అజెండాగా.. విభజన సమస్యలపై చర్చ ఉండబోతోంది. అలాగే.. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్‌ లోని ఆర్టీసీ, ఆర్థిక సంఘం, తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్శిటీ, ఉన్నత విద్యామండలి వంటి 30 సంస్థల స్థిర, చర ఆస్తులపై చర్చ జరగనుంది.

Share