Current Date: 04 Jul, 2024

CM Jaganmohan Reddy's bus trip to Anakapalli district

ఏపీ ఆపద్దర్మ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేటి శుక్రవారం రాత్రి పాయకరావు పేట వద్ద అనకాపల్లి జిల్లా లోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు జిల్లాలోకి ప్రవేశించి జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం గొడిచర్ల జంక్షన్ వద్దకు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు. అనంతరం 20వ తేదీ ఉదయం అనకాపల్లి నియోజకవర్గం లోని కశింకోట మండలం తాళ్ళపాలెం సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం జగ న్ రాక సందర్భంగా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం సన్నాహాలు చేస్తున్నారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జన సేన సమీకరణతోపాటు ఇతర ఏర్పాట్లలో నిమగ్నమై వున్నారు