Current Date: 07 Oct, 2024

ఏపీలో ఎలుకలు చాలా జాదూ గురూ

దేశంలో ఉన్న ఎలుకలందు ఏపీలో ఎలుకలు వేరు అవును మీరు వింటున్నది నిజమే..! ఎందుకంటే ఏపీలోని ఎలుకలు చాలా జాదూ..అవి ఏకంగా ఫైళ్లనే తగుల బెట్టాయ్..వినడానికి విచిత్రంగా ఉన్నా మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది చెబుతున్న వాస్తవమిది. విజయవాడలో ఓ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఫైళ్లన్నీ తగులబడిపోయాయి. అసలు ఆ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందా? అని ఆరా తీసిన అధికారులకు మైనర్ ఇరిగేషన్ శాఖ సిబ్బంది షాకింగ్ రిప్లై ఇచ్చారు. అదేంటంటే.. ఎలుకలట.. వైర్లను కొరికాయట.. తద్వారా అగ్నిప్రమాదం జరిగిందని,ఫైళ్లు తగలబడిపోయాయని చెబుతున్నారు.

Share