Current Date: 07 Oct, 2024

హత్య చేసిన యువకుడు ఆత్మహత్య

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం గ్రామంలో ప్రేమోన్మాది  దర్శిని ఈనెల 6న కత్తితో హతమార్చిన సంఘటన తెలిసినదే.  సురేష్ పరారీలో ఉన్నట్లు జిల్లా పోలీస్ యంత్రం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ ఆచూకీ తెలిపితే జిల్లా పోలీసులు  50, వేలు నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. గురువారం అదే కొప్పగుండుపాలెం శివారులోబాలికను చంపిన ప్రేమోన్మాది సురేష్  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గుర్తించారు. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిరాతకంగా  హతమార్చడం పై తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు అలాంటి సైకోని ఉరితీయాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిన సంగతి ప్రజల్లో సైకోకు మంచి శిక్ష జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. సంఘటన స్థలానికి రాంబిల్లి సీఐ నర్సింగరావు పోలీస్ సిబ్బంది చేరుకొని జిల్లా ఎస్పీకి సమాచారం చేరవేశారు.

Share