Current Date: 06 Jul, 2024

Botsa Satyanarayana Denied Yellow Media Fake Allegations On Land Titling Act |

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతు న్న ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై కొన్ని పత్రికలు అసత్యాలు ప్రసారం చేస్తున్నా యని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విశాఖ బీచ్ రోడ్డు లోని వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్సా ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో బొత్సా మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా బొత్సా మాట్లాడు తూ .. ఎన్నికల సమయంలో ప్రజలను తప్పు త్రోవ పట్టించేందుకే ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు అబుత కల్పనలు ప్రచారం చేయటం వారి దిగజారుడి తనానికి నిద ర్శనమన్నారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయిన పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పవలసిన అవసరం లేద ని, పవన్ ప్రసంగాల్లో వాడే భాష అభ్యం తరకరంగా ఉందని బొత్సా ఫైర్ అయ్యా రు. అదేవిధంగా తన కుమారుడు మరో ఆరుగురితో కలిసి కొనుగోలు చేసిన భూమిపై తప్పుడు కధనాలను అయన ఖండించారు. ఈ సమావేశంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు పాల్గొన్నారు.