Current Date: 02 Oct, 2024

జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్...

బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాల్ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నాటి సీఎం వైఎస్ జగన్ అనుసరించిన వ్యవహార శైలిని తూర్పారబట్టారు. ఆయనకూ ఇద్దరు బిడ్డలున్నారు కదా? జైత్వాల్‌కు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదని అని ప్రశ్నించారు. ముంబై నటి కాదంబరి జైత్వాల్‌ను కట్టడి చేయడానికి, ఆమెను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్స్ వేశారని విమర్శించారు. కాదంబారి జైత్వాల్ ఒక మహిళా డాక్టర్ అని ఆమెను మానసికంగా వేధించారని విమర్శించారు. యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైత్వాల్ సామాన్యురాలైతే రూ. 100 కోట్లు ఇచ్చి నొక్కిపెట్టేసేవారన్నారు. జైత్వాల్‌కి అండగా పోరాటం చేయడానికి తాము సిద్ధం అని షర్మిల ప్రకటించారు.

Share