Current Date: 02 Oct, 2024

విపరీతమైన కడుపునొప్పితో కేజీహెచ్ కి వచ్చిన మహిళ స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో కేజీహెచ్‌‌కు వచ్చింది. వెంటనే టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్టులు చూసి స్టన్ అయ్యారు. ఆమె కడుపులో ఎముకల గూడు ఉన్నట్లు నిర్ధారించి నిర్ఘాంతపోయారు. వెంటనే సర్జరీ చేసి.. ఎముకలు తొలగించారు.  వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఇక పిల్లలు వద్దనుకుని.. అబార్షన్‌ కోసం మెడిసిన్ వాడారు. ఆ తర్వాత నుంచి ఆమెకు కడుపు నొప్పి ఉండేది. అయితే ఇటీవలే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో.. ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్‌ ప్రసూతి విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణిని సంప్రదించారు. వెంటనే బాధితురాలికి డాక్టర్ వాణి..  MRI స్కాన్‌ చేయగా.. 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది.  వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు.  అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు.  వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘లితోపెడియన్‌’గా వ్యవహరిస్తారని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు.

Share