Current Date: 06 Oct, 2024

నుదుటిపై బొట్టు లేదని హీరోయిన్‌ను ఆపిన ఆలయ సిబ్బంది రచ్చ రచ్చ

జన్మాష్టమి రోజున హీరోయిన్ నమితకి చేదు అనుభవం ఎదురైంది. తన భర్తతో కలిసి ఆమె మధుర మీనాక్షి దేవాలయానికి వెళ్లింది. కానీ ఆమె నుదుటపై బొట్టు లేకపోవడంతో ఆలయ సిబ్బంది దాదాపు 20 నిమిషాలు దర్శనానికి వెళ్లనివ్వకుండా ఆపేశారు. హిందూ మతానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని దేవాలయ సిబ్బంది ప్రశ్నించారని నమిత చెప్పుకొచ్చింది. వాస్తవానికి నమిత హిందూ సంప్రదాయాలను గౌరవిస్తుంది. ఆమె తిరుపతిలోనే పెళ్లి చేసుకుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే? ఆమె కొడుకు పేరు  కృష్ణుడు.ఇవన్నీ చెప్పినా.. ఓ 20 నిమిషాల పాటు ఆలయంలో ఓ మూలన నమితను సిబ్బంది కూర్చోబెట్టారు. వాదోపవాదల తర్వాత నుదుటిపై కుంకుమ పెట్టుకున్నాక దర్శనానికి అనుమతించారు. నమితతో గొడవపై ఆలయ సిబ్బంది స్పందించారు. ఆమెతో అమర్యాదకరంగా ప్రవర్తించలేదని, ఆలయ నిబంధనల మేరకే వ్యవహరించామని కుంకుమ పెట్టుకున్న తర్వాత ఆలయంలోకి అనుమతించామని వెల్లడించారు. నమిత తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతుండటం గమనార్హం.

Share