Current Date: 06 Oct, 2024

విశాఖలో హోంమంత్రి అనిత స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

 విశాఖలో హోంమంత్రి అనిత ఆదివారం బిజీ బిజీగా గడిపారు. అనకాపల్లి నుంచి విశాఖ చేరుకున్న ఆమెకు టీడీపీ నేతలు, జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు. తొలుత ఆమె మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గంటా తనయుడు రవితేజ ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం ఆమె నగరంలోని టీడీపీ కార్యాలయానికి విచ్చేయగా, పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అనితకు ఆహ్వానం పలికి అనంతరం ఘనంగా సత్కరించారు.

Share