Current Date: 02 Jul, 2024

రైతుల కమిషన్‌ సొమ్ము తిరిగి ఇచ్చేసిన విడదల రజనీ

 ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత వైసీపీ నేతల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ మంత్రి విడదల రజనీ అనుచరులు రైతుల నుంచి భూముల కోసం నొక్కేసిన కమిషన్‌ తిరిగి ఇచ్చేసారు. ఈ ఘటన ఇప్పుడు సంచనలంగా మారింది. టీడీపీ నేతల వద్ద రజనీ అనుచరుల అక్రమ వసూళ్ల పై పంచాయితీ పెట్టారు. దీంతో, సొమ్ము తీసుకున్న వారు తిరిగి రిటర్న్‌ చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు. తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామంలో విడదల రజిని రైతుల వద్ద కమీషన్‌గా తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేశారు.

Share