Current Date: 29 Sep, 2024

నర్సీపట్నం ఆర్డిఓ గా విల్లూరి వెంకటరమణ

నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారిగా  విల్లూరి వెంకటరమణ శనివారం సాయంత్రం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పాలకొండ ఆర్డీవో పనిచేస్తున్న ఈయన బదిలీపై నర్సీపట్నం ఆర్డీవో గా నియమితులయ్యారు. నర్సీపట్నం డివిజన్ ప్రజలకు వివి రమణ  సుపరిచితులు. నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, నక్కపల్లి పలు మండలాల్లో ఈయన గతంలో తహసిల్దార్ గా పనిచేసి ప్రజల మన్ననలను పొందారు. పదోన్నతి పొందిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా, పాలకొండ ఆర్డిఓగా పనిచేసిన తర్వాత, నర్సీపట్నం ఆర్డీవోగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.  నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ లోని తహసిల్దారులు, రెవెన్యూ ఉద్యోగులు ఆర్డీవో వివి రమణను కలిసి అభినందనలు తెలియజేశారు.

Share