Current Date: 06 Jul, 2024

Attack on Pawan's nephew in Pithapuram

జనసేన పార్టీ ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మేనల్లుడు , నటుడు సాయి ధరమ్ తేజ్‌పై పిఠాపురంలో దాడి జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఆయనకు ఏమికాలేదు. ఓటమి భయంతో ఇలా దాడులకు పాల్పడుతున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ రెండు రోజులుగా తేజు పిఠాపురం లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం తాటిపర్తిలో ప్రచారం చేస్తుండగా..కొంతమంది ఆకతాయిలు తేజ్ మీద కూల్ డ్రిక్స్ బాటిల్స్ విసిరారు. ఈ క్రమంలో తేజు తప్పుకోవడం తో ఆయన పక్కనే ఉన్న జనసేన వీరాభిమాని నల్ల శ్రీధర్‌కు ఆ బాటిల్ తగిలింది. దీంతో.. అతని కంటిపై గాయమై, తీవ్ర రక్తస్రావమైంది.

అంతకుముందు కూడా తేజ్ రోడ్ షోలో భాగంగా తాటిపర్తి నుంచి చిన్న జగ్గంపేట వెళ్తున్న సమయంలోనూ వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. బాణసంచా బాంబులు వేస్తూ హల్‌చల్ చేశారు. అంతే కాకుండా జనసేన శ్రేణులు, మెగా అభిమానులతోనూ వాగ్వివాదానికి దిగారు. దీంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.