Current Date: 06 Oct, 2024

అలిపిరి మెట్లపై కొత్త పెళ్లి కొడుకు మృతి వధువు కన్నీటి రోదన

శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. నవీన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. వివాహం తర్వాత నవీన్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.భార్య, కుటుంబ సభ్యలతో కలిసి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు వెళ్తుండగా 2,350వ మెట్టు దగ్గరకు రాగానే అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే నవీన్‌ను అంబులెన్స్‌ ద్వారా తిరుపతిలోని స్విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది నవీన్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.నవీన్‌ది తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతంకాగా ఆయన బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ ఘటనంపై తిరుమల టూటౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share