Current Date: 04 Jul, 2024

స్పీకర్ గారూ నన్ను రక్షించండి

నేను మా వార్డ్ లో  తిరగలేకపోతున్నాను.నేను తీవ్ర భయాందోళనకు గురవుతున్నాను.పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నాకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగుదేశం నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాన్యురాలిలా చూసారు.నన్ను ఏ సమయంలో నైనా టిడిపి నాయుకులు ఏదైన చేసేలా ఉన్నారు.  నా మీద దాడికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే పోలీసులను ఆశ్రయిస్తాను.నేను ఎప్పుడూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు  కుటుంబాన్ని  దూషించలేదు.స్పీకర్ గారికి మీడియా ద్వారా విన్నవించుకుంటున్నానుమా వార్డ్ లో ఒంటరి మహిళనైన నాకు రక్షణ కల్పించండి. అంటూ దళిత మహిళ అయిన నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి సోమవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

Share