Current Date: 06 Oct, 2024

సింహాద్రప్పన్నకు మొక్కులు చెల్లించిన గణబాబు

ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు గణబాబు శనివారం సింహ్రాదప్పన్నకు మొక్కులు చెల్లించారు. గోపాలపట్నంలోని తన నివాసం నుంచి  సింహాచలం వరకు కాలి నడకన వెళ్లి గణబాబు అప్పన్న దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ యువనేత మౌర్య సింహ, టీడీపీ కార్పొరేటర్లు, వార్డు నాయకులు, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share