Current Date: 30 Sep, 2024

హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌ భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు

హైద‌రాబాద్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న కేబీఆర్ పార్క్ వద్ద గురువారం చోటుచేసుకుంది. ఇది చూసిన జ‌నం ఆశ్చర్యపోయారు. మొద‌ట త‌క్కువ‌గా వ‌చ్చిన పొగ‌లు, ఆ త‌ర్వాత క్ర‌మంగా పెరిగిన‌ట్లు స‌మాచారం. కాగా, ఇటీవ‌ల అదే ప్రాంతంలో విద్యుత్ శాఖ వారు అండర్ గ్రౌండ్‌లో 11కేవీ కేబుల్ అమర్చినట్లు తెలుస్తోంది. దానివల్లే పొగలు వచ్చి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు

Share