Current Date: 05 Oct, 2024

రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలం...

మరో మూడ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. మరోవైపు, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.