Current Date: 06 Oct, 2024

80వేల మందికి సీటింగ్‌ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధం

ఏపీ  ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్‌ పెట్టింది. 11ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఐదుగరు ఐఏఎస్‌ అధికారుల పర్యవేక్షణలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్‌, భద్రత, పార్కింగ్‌పై అధికారులు దృష్టి సారించారు. ప్రముఖులతో పాటు దాదాపు లక్ష మందికి పైగా ప్రజలొస్తారని  అంచనా. 80వేల మందికి సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Share