Current Date: 06 Oct, 2024

ఏపీ ఎండీసీ, మైనింగ్‌ డైరెక్టర్‌ ఆఫీస్‌ సీజ్‌ చేసిన సీఐడీ

ఆంధ్రప్రదేశ  ఎండీసీ, మైనింగ్‌ డైరెక్టర్‌ కార్యాలయాన్ని సోమవారం సీఐడీ విభాగం సీజ్‌ చేసింది. అంతేకాకుండా సంబంధిత ఉద్యోగుల్ని కార్యాలయానికి రావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్‌ శాఖ  డైరెక్టర్‌ వెంకట్‌ రెడి్డ లాగిన్‌ ఐడీని అధికారులు  డిజేబుల్‌ చేసేశారు. సదరు ఐడీని ఇన్‌చార్జిగా ఉన్న ఐఏఎస్‌ యువరాజుతో లాగిన్‌ చేయించారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నాటి నుంచి ఈ-ఆఫీస్‌లో ప్రాసెస్‌ చేసిన ఫైళ్లను ఆపేయాలని కూడా ఆదేశాలందాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వెంకట్‌ రెడ్డి ఆఫీస్‌కు వచ్చి వెళ్లేవారని, కొన్ని ఫైళ్లపై వెంకట్‌రెడ్డి క్లియరెన్స్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోందని గుర్తించారు.  ఇబ్రహీంపట్నం లోని మైనింగ్‌ ఆఫీస్‌ను కూడా అధికారులు  సీజ్‌ చేశారు.

Share